News April 13, 2025

శ్రీ సత్యసాయి: ఆలయ భూకబ్జాపై EO సీరియస్

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలలోని గుడిపల్లి సజ్జ గంటి రంగనాథస్వామి ఆలయ భూమిని సర్పంచ్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన గ్రామస్థులు శనివారం కబ్జాను అడ్డుకున్నారు. సర్వే ప్రకారం గ్రామస్థులు ఆ భూమికి చుట్టూ రాళ్లు పాతారు. సర్పంచ్ రాత్రి ఆ రాళ్ళను తొలగించారు. విషయం తెలుసుకున్న EO ఈశ్వర్ దేవాలయ భూమిని పరిశీలించి, బోర్డును వేసి ఈ భూమిలోకి ఎవరైనా వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 23, 2025

పాడేరు: ‘జనగణన ప్రక్రియకు ప్రారంభంకానున్న శిక్షణ’

image

2027లో నిర్వహించనున్న జనాభా జనగణన ప్రక్రియకు సంబంధించి గురువారం అధికారులకు కలెక్టరేట్‌లో శిక్షణ నిర్వహించారు. గణనకు సంబంధించి ముందుగా జీకేవీధి మండలంలోని 6 పంచాయతీల పరిధిలో ఉన్న 18 గ్రామాల్లో ప్రీ టెస్ట్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డీఆర్వో కే.పద్మలత తెలిపారు. గణన ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సమాచారం సేకరించబడుతుందన్నారు.

News October 23, 2025

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ గైడ్‌లైన్స్ విడుదల

image

AP: NCTE నిబంధనల ప్రకారం TET నిర్వహించేలా GOVT గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లందరికీ టెట్ తప్పనిసరి చేసింది. టెట్‌ 2A, 2B (B.Ed) పేపర్లలో SC, ST, BC, PHCలకు అర్హత మార్కుల్లో మినహాయింపు ఈసారి లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌ పాసవ్వాలి. అయితే వారికి నిర్దేశిత అర్హతల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిటైల్డ్ గైడ్ లైన్స్ కోసం <>క్లిక్<<>> చేయండి.

News October 23, 2025

పూడూరు: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

image

పూడూరు మండలం సోమన్గుర్తి శివారులో గురువారం రాత్రి స్టీల్ ఫ్యాక్టరీ ముందు నేషనల్ హైవే రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదాచారుడిని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన రితేష్ (22)గా గుర్తించారు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.