News April 16, 2025
శ్రీ సత్యసాయి: కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన SP

నియోజవర్గ కేంద్రమైన మడకశిరలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరాలు పట్టణమంతా ఏర్పాటు చేశారు. ప్రస్తుత కాలంలో నేరాలు అదుపు చేయడంలో, నేరస్తులను కనిపెట్టడంలో సీసీ కెమెరాలు వినియోగం ఎంతో అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా అందజేసిన దాతలను ఎస్పీ మంగళవారం సన్మానించారు.
Similar News
News December 10, 2025
అల్లూరి జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా వాహన ప్రమాదాల నివారణకు గత వారం రోజులుగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించామని జిల్లా ఏఎంవీఐ సాయి రమేశ్ మంగళవారం తెలిపారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 12 జీపులకు రూ.80,330 చలానా విధించామన్నారు. అధిక ధరలు, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని మూడు జీపులను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించామన్నారు.
News December 10, 2025
VKB: మొదటి విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో ఈనెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్పై ఆయన సమీక్షించారు. మొదటి విడతలో భాగంగా ఉదయం పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 10, 2025
WGL: రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు..!

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం పర్వం జోరందుకుంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యంతో పాటు నాన్వెజ్ భోజనాలతో దావత్లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షల వరకు మద్యం ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే ఈ వ్యయం రూ.20 లక్షలకు చేరుతోంది. ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు అయ్యే వీలున్నట్లు అంచనా.


