News January 29, 2025
శ్రీ సత్యసాయి: గ్రామాలకు వెళ్లి పల్లె నిద్రలు చేపట్టండి: ఎస్పీ

శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన పోలీస్ అధికారులు గ్రామాలకు వెళ్లి పల్లె నిద్రలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో మాట్లాడుతూ.. పెండింగ్ కేసులలో దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు గ్రామాలకు వెళ్లి పల్లె నిద్ర చేపట్టి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News October 22, 2025
నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?
News October 22, 2025
సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన: కలెక్టర్

తెలంగాణ రైజింగ్- 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని చెప్పారు. 2047 నాటికి దేశ స్వాతంత్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్బంగా తెలంగాణ ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు.
News October 22, 2025
సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.