News November 9, 2024

శ్రీ సత్యసాయి: చేనేత మగ్గానికి ఉరివేసుకున్న నేతన్న

image

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగట్టువారిపల్లెలో చేనేత మగ్గానికి ఉరివేసుకుని ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన సీ.హరి(45) మారుతీ నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో నేడు ఆయన చేనేత మగ్గానికి ఉరివేసుకుని మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News November 16, 2025

భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

News November 14, 2025

రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

image

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

News November 13, 2025

10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

image

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.