News November 9, 2024
శ్రీ సత్యసాయి: చేనేత మగ్గానికి ఉరివేసుకున్న నేతన్న

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగట్టువారిపల్లెలో చేనేత మగ్గానికి ఉరివేసుకుని ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన సీ.హరి(45) మారుతీ నగర్లో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో నేడు ఆయన చేనేత మగ్గానికి ఉరివేసుకుని మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News September 17, 2025
అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.
News September 17, 2025
పంట నమోదుకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి, రైతులను పంట వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 2025-26 సంవత్సరం PM కిషన్ అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత అక్టోబర్లో విడుదల చేస్తామని చెప్పారు. అకౌంట్ నంబర్ను మొబైల్ నంబర్తో లింక్ చేసుకోవాలని సూచించారు.
News September 17, 2025
డీఎస్సీలు అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు: డీఈవో

అనంతపురం జిల్లాలో డీఎస్సీలో 755 మంది ఉద్యోగాలు సాధించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. 75 మందిని అమరావతికి తీసుకెళ్లేందుకు 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రేపు ఉదయం 6 గంటలకు అనంతపురంలోని PVKK కళాశాలకు చేరుకోవాలని సూచించారు.