News January 26, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో తలకిందులుగా జాతీయ జెండా

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అయితే ముదిగుబ్బ గ్రంథాలయాధికారి జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానపరిచారు. ఎంఈవో రమణప్ప, టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ తుమ్మల మనోహర్ నాయుడు డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్తూ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే వారు జెండాను సరిచేసి, ఎంఈవో చేత మళ్లీ ఎగురు వేయించారు.

Similar News

News October 21, 2025

మేడ్చల్‌లో యాక్సిడెంట్.. ఒకరు దుర్మరణం

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పీఎస్ పరిధి జాతీయ రహదారిపై ఎల్లంపేట్ వివేకానంద విగ్రహం ముందు డబిల్ పూర్ చౌరస్తా వైపు వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపు తప్పి మేడ్చల్ వైపు ప్రయాణిస్తున్న ముగ్గురు వాహనదారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 21, 2025

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

AP: NTR జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/

News October 21, 2025

ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

image

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్‌చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.