News January 26, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో తలకిందులుగా జాతీయ జెండా

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అయితే ముదిగుబ్బ గ్రంథాలయాధికారి జెండాను తలకిందులుగా ఎగురవేసి అవమానపరిచారు. ఎంఈవో రమణప్ప, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మల మనోహర్ నాయుడు డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్తూ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే వారు జెండాను సరిచేసి, ఎంఈవో చేత మళ్లీ ఎగురు వేయించారు.
Similar News
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


