News March 27, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో నేడే ఎన్నికలు

శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని రొద్దం, గాండ్లపెంట, రామగిరి, కనేకల్లు, కంబదూరు మండలాల్లో MPP, ఉరవకొండ, పెద్దపప్పూరు, యల్లనూరు, రాయదుర్గం మండలాలలో వైస్ ఎంపీపీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అనంతపురం జడ్పీ సీఈవో రాజోలి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా మండలాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News December 1, 2025
వనపర్తి జిల్లా నేటి ముఖ్యాంశాలు

>WNP: రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు ఉమర్ సిద్ధిక్
>ATKR: సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం
>WNP: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
>WNP: దేశంలోనే అత్యుత్తమ రహదారులను నిర్మిస్తాం మంత్రి
>GPT: BRSలో చేరిన మాజీ ఎంపీటీసీ
>WNP: దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలి
>PBR: నమ్మి వచ్చిన వారికి అండగా ఉంటా: నిరంజన్ రెడ్డి
>WNP: రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడికి డాక్టరేట్
News December 1, 2025
ములుగు: చల్పాక ఎన్కౌంటర్కు ఏడాది

ఏటూరునాగారంలోని చల్పాక అటవీ ప్రాంతంలో గత ఏడాది డిసెంబర్ 1న జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఘటన జరిగి నేటికీ సరిగ్గా ఏడాది. కాగా, ఎన్కౌంటర్కు కీలక నేత బద్రు, మల్లయ్య, దేవల్, జమున, కిషోర్, కామేష్తోపాటు మరో సభ్యుడు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్లో ఆడి పాడి సేద తీరారు.


