News August 20, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళ దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు గ్రామ పొలాల్లో దారుణం చోటు చేసుకుంది. మేకల కాపరి జయమ్మ అనే మహిళను గొంతు బిగించి దుండగులు దారుణ హత్య చేశారు. 20 మేకలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం మేకలు తోలుకొని వెళ్లిన జయమ్మ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇవాళ ఉదయం గ్రామ పొలాల్లో శవాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News November 25, 2025
అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.
News November 25, 2025
అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.


