News January 28, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆదివారం నల్లమాడ మండలం చెర్లోపల్లిలో రత్న అనే మహిళ గొలుసు లాక్కెళ్లిన ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. ఓబులదేవరచెరువులో సోమవారం సాయంత్రం భార్గవి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఆమె తన దుకాణంలో వాటర్ బాటిల్ ఇస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు చైన్ లాక్కొని బైక్పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 3, 2025
NRPT: నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నేడు నారాయణపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్ఈ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
News November 3, 2025
జగిత్యాల: 55 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు..!

జగిత్యాల పట్టణంలోని మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్ ( ప్రస్తుత ఓల్డ్ హై స్కూల్ ) 1969-70 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 55 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరంతా తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా హాయిగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, రాచకొండ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.
News November 3, 2025
మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్కు అప్పగించారు.


