News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

గాండ్లపెంట మండలం తూపల్లి పంచాయతీ వంకపల్లిలో సచివాలయ ఉద్యోగి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
నో మేకప్.. మేకప్ లుక్ కావాలా?

ప్రస్తుతకాలంలో ‘నో మేకప్- మేకప్ లుక్’ ట్రెండ్ అవుతోంది. దీనికోసం తేలిగ్గా ఉండే మాయిశ్చరైజర్, రేడియన్స్ ప్రైమర్, ల్యుమినైజింగ్ ఫౌండేషన్ వాడాలి. డార్క్ సర్కిల్స్ కనిపించకుండా లైట్గా కన్సీలర్ రాయాలి. ఐ ల్యాష్ కర్లర్, మస్కారా, ఐ లైనర్ అప్లై చెయ్యాలి. చీక్ బోన్స్పై బ్రాంజర్, బ్లషర్ రాయాలి. మ్యూటెడ్ లిప్ కలర్, టింటెడ్ లిప్ బామ్ పెదవులకు అద్దాలి. అంతే మీ నో మేకప్ లుక్ రెడీ.
News September 16, 2025
HYD: అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్!

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని HYD లక్డీకపూల్లోని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారని సమాచారం. OCT 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ఈ సంఘం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నట్లు తెలిసింది. కొంతకలంగా వారు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News September 16, 2025
HYD: నిందితులు ముగ్గురు చిన్ననాటి ఫ్రెండ్స్

కూకట్పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాంచీకి చెందిన ప్రధాన నిందితులు హర్ష్ కుమార్, రోషన్ సింగ్ వారికి సహకరించిన రాజువర్మను కంది జైలుకు తరలించారు. ఈ ముగ్గురూ చిన్ననాటి నుంచి స్నేహితులని పోలీసులు తెలిపారు.