News March 10, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
Similar News
News November 27, 2025
WNP: రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు (RO) కీలక సూచనలు చేశారు. నిర్దేశించిన పత్రాలు లేని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించకుండా, వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. నామినేషన్లను పక్షపాతం లేకుండా, జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
News November 27, 2025
పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. ఇటు ఎన్నో పాపులర్ పాటలు పాడిన రాహుల్ ‘నాటు నాటు’ సాంగ్తో ఆస్కార్ స్థాయికి ఎదిగారు.
News November 27, 2025
ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.


