News March 24, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 145 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పరీక్ష జరగ్గా రెగ్యులర్ విద్యార్థులు 21,394 మందికి గానూ 21,283 మంది హాజరయ్యారని, ప్రైవేటు విద్యార్థులు 235 మందికి గానూ 201 హాజరయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.

Similar News

News November 19, 2025

బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

image

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.

News November 19, 2025

ర్యాలీని ప్రారంభించిన మేయర్, కమిషనర్

image

వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులతో మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సమావేశం నిర్వహించారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు వాహనాలతో ఏర్పాటు చేసిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఉత్తమ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను మేయర్, కమిషనర్ సత్కరించారు.

News November 19, 2025

ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

image

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్‌లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్‌ అటాక్‌లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.