News March 3, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 214 మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులలో 9,256 మంది విద్యార్థులకు గానూ 9,080 మంది హాజరైనట్లు డీఐఈవో రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,141మంది విద్యార్థులకు గానూ 1,103 మంది హాజరయ్యారన్నారు. 214 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.

Similar News

News December 8, 2025

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

image

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.

News December 8, 2025

‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

News December 8, 2025

పెద్దపల్లి : 24 ఏళ్లకు మళ్లీ ఆ రిజర్వేషన్

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓదెల మండలం కొలనూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ అయింది. 2001 తర్వాత గ్రామానికి ఈ రిజర్వేషన్ రావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న చాలామంది మొదటిసారి సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ రావడం.. ఇప్పుడుపోతే మళ్లీ ఎప్పుడు రిజర్వేషన్ వస్తుందో అన్న ఆలోచనతో అభ్యర్థులు ఈసారి తీవ్రంగానే శ్రమిస్తున్నారు.