News May 24, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో 43,714 జవాబు పత్రాలు విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పదో తరగతి 2024 మార్చి ఫలితాల్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 43,714 జవాబు పత్రాలను విడుదల చేశారు. 55,966 జవాబు పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 43,714 జవాబు పత్రాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం రాష్ట్ర డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల లాగిన్లలోని జవాబు పత్రాలను దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జారీచేయాలని ఆదేశించారు.

Similar News

News September 17, 2025

డీఎస్సీలు అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు: డీఈవో

image

అనంతపురం జిల్లాలో డీఎస్సీలో 755 మంది ఉద్యోగాలు సాధించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. 75 మందిని అమరావతికి తీసుకెళ్లేందుకు 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రేపు ఉదయం 6 గంటలకు అనంతపురంలోని PVKK కళాశాలకు చేరుకోవాలని సూచించారు.

News September 17, 2025

సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన చైనా ప్రతినిధి బృందం

image

అనంతపురం జిల్లా జంతలూరులోని AP సెంట్రల్ యూనివర్సిటీని న్యూఢిల్లీ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. కౌన్సిలర్ యాంగ్ షీయుహువా, జాంగ్ హైలిన్, సూ చెన్, ఫాంగ్ బిన్ CUAP ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరిని కలిశారు. విద్యలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులకు చైనా విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఉపకారవేతన పథకాల గురించి వివరించారు.

News September 17, 2025

ఉరవకొండలో పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు

image

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.