News March 1, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 479 మంది విద్యార్థులు గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 11,843 మంది విద్యార్థులకు గానూ 11,460 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,580 మంది విద్యార్థులకు గానూ 1,484 మంది హాజరయ్యారన్నారు. 479 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.

Similar News

News March 1, 2025

కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్‌పోర్ట్: సీఎం

image

TG: వరంగల్(D) మామునూరు విమానాశ్రయం కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు తరహాలో ఉండాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. నిత్యం రాకపోకలతో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్‌కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 1, 2025

BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!