News March 1, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 479 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 11,843 మంది విద్యార్థులకు గానూ 11,460 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,580 మంది విద్యార్థులకు గానూ 1,484 మంది హాజరయ్యారన్నారు. 479 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వివరించారు.
Similar News
News October 19, 2025
పాతమాగులూరు: హత్య కేసులో బెయిల్ మంజూరు

సంతమాగులూరు మండలం పాత మాగులూరులో బెంగళూరుకు చెందిన వీరస్వామి రెడ్డి, వీరస్వామి రెడ్డి జులై 23న నరసరావుపేటలో కిడ్నాప్నకు గురయ్యారు. అనంతరం అదేరోజు మండలంలోని పాత మాగులూరు వద్ద హత్యకు గురయ్యారు. అదే నెల 27న బాదం మాధవరెడ్డి సహా 12 మంది ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. సంబంధించి శనివారం మాధవరెడ్డితో సహా 11 మందికి బెయిల్ మంజూరైంది.
News October 19, 2025
వనపర్తి జిల్లా నుంచి 73 లైసెన్స్ సర్వేయర్లు ఎంపిక

వనపర్తి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు లైసెన్స్ పంపిణీని కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా నుంచి 73 మంది లైసెన్స్ సర్వేయర్లు హైదరాబాద్ బయలు దేరారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా HYD శిల్పకళా మాదాపూర్లో సర్వేయర్లకు లైన్స్ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర మొత్తం 3,465 మంది లైసెన్స్ సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేయనున్నారు.
News October 19, 2025
విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పున్నమి ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పున్నమి ఘాట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.