News March 6, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 551మంది గైర్హాజరు

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నేడు పార్ట్‌-3లోని పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జనరల్ విద్యార్థులలో 12,437 మందికి గానూ 11,985 మంది, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,644 మందికి గానూ 1,545 మంది హాజరయ్యారు. మొత్తం 551 గైర్హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

Similar News

News March 7, 2025

TODAY HEADLINES

image

☛ తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: చంద్రబాబు
☛ APకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల
☛ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్
☛ SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు TG క్యాబినెట్ ఆమోదం
☛ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ BJPదే గెలుపు: KTR
☛ TG: ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ UKలో విదేశాంగ మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నం
☛ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి

News March 7, 2025

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

image

*HYDలో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి ఆమోదం
*ORRకు ఇన్నర్ సైడ్ ప్రాంతం కోర్ తెలంగాణ.. ORR నుంచి RRR వరకు అర్బన్ తెలంగాణ. మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణ
*సెర్ప్, మెప్మాల విలీనం
*మహిళా సంఘాల వయోపరిమితి 15-65 ఏళ్లుగా నిర్ణయం
*డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం
*యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

News March 7, 2025

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

image

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.

error: Content is protected !!