News March 28, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు వాయిదా పడిన రామగిరి, గాండ్లపెంట ఎంపీపీల స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఎన్నికల సమయంలో 30 యాక్ట్ అమలులో ఉంటుందని, 144 సెక్షన్ అమలు పరచడం జరుగుతుందన్నారు. నిరంతరం సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

Similar News

News November 16, 2025

జగిత్యాల: 10 నెలల్లో 8,686 కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కఠినంగా కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. గత 10 నెలల్లో జిల్లాలో 8,686 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మత్తులో ప్రమాదాలకు కారణమైన వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.

News November 16, 2025

సరికొత్త రీతిలో మోసాలు.. జాగ్రత్త: ADB SP

image

సైబర్ నేరగాళ్లు సరికొత్త రీతీలో మోసం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. గతవారం జిల్లాలో 11 కేసులో నమోదైనట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ జాబ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, లోన్ ఇస్తామంటూ వచ్చే యాడ్స్ నమ్మవద్దని వివరించారు. రూ.2 నోటుకు రూ.32 లక్షలు ఇస్తామంటూ వచ్చే ప్రచారాలు అవాస్తవమని వాటిని నమ్మకూడదన్నారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News November 16, 2025

ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

image

కొన్ని క్రీములను కలిపి రాయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సి ఉన్న క్రీములతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ను రాత్రే రాయాలి. హైలురోనిక్ యాసిడ్‌తోపాటు ఏహెచ్ఎ, బీహెచ్ఎ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.