News March 17, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

image

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

image

HYDలోని బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తూములు మూసేసి అలుగుల ఎత్తు పెంచుతున్నారని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్ది కబ్జా చేస్తున్నారని మరి కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

News October 27, 2025

అత్యుత్తమ వివాహ రకమిదే..

image

వివాహాలన్నింటిలో బ్రాహ్మమును ధర్మబద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలో వధువు తండ్రి తగిన అర్హతలు గల వరుడిని స్వయంగా అన్వేషించి, ఆహ్వానిస్తారు. తన కుమార్తెను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దానం చేస్తారు. ఇది ధర్మ సంయోగానికి ప్రతీక. ఈ దానం ద్వారా వధువు తండ్రి పుణ్యాన్ని పొందుతాడు. వధూవరులు ధార్మిక జీవితాన్ని ప్రారంభించి, సుఖసంతోషాలతో, ఉత్తమ గతులు పొందుతారు. ఇది దైవిక ఆశీస్సులతో కూడిన వివాహ బంధం. <<-se>>#Pendli<<>>

News October 27, 2025

సికింద్రాబాద్: తుఫాన్.. ఆ రైళ్లు CANCEL

image

తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పలు రైళ్లను క్యాన్సల్ చేసింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్ నుంచి పాండిచ్చేరి వెళ్లే రైళ్లను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు రైళ్ల రద్దు కొనసాగుతుందని CPRO శ్రీధర్ తెలిపారు.