News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ పీడీగా శ్రీదేవి బాధ్యతలు స్వీకరణ

శ్రీ సత్యసాయి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీదేవి బాధ్యత స్వీకరించారు. తాడిపత్రిలో పనిచేస్తున్న శ్రీదేవి పదోన్నతిపై శ్రీ సత్యసాయి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా నియమితులయ్యారు. సోమవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఆమె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 16, 2025
చేగుంట: ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బంగారయ్య

చేగుంట మండలం చందాయిపేట హైస్కూల్ ఉపాధ్యాయులు గంగిశెట్టి బంగారయ్య ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. బంగారయ్యకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాండు, నర్సింలు, చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటగౌడ్, మనోహర్ రావు, కార్యవర్గ సభ్యులు సుధాకర్, సిద్ధిరాములు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాణి శుభాకాంక్షలు తెలిపారు
News November 16, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ


