News February 12, 2025
శ్రీ సత్యసాయి: టెన్త్ అర్హతతో 50 ఉద్యోగాలు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డివిజన్లో 50 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News November 26, 2025
MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.
News November 26, 2025
BREAKING: వరంగల్: ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఇన్స్పెక్టర్ ఓ.రమేష్, కానిస్టేబుల్ జి.రఘును సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు. మామూనూరు పీఎస్ నుంచి కంట్రోల్ రూమ్కు బదిలీ అయిన ఇన్స్పెక్టర్ రమేష్తో పాటు, కానిస్టేబుల్ రఘుపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యాయి. దీంతో సీపీ ఈ చర్య తీసుకున్నారు.
News November 26, 2025
మున్సిపాల్టీల విలీనంతో HMDA ఆదాయానికి గండి

గ్రేటర్లో మున్సిపాల్టీల విలీనం తరువాత HMDA ఆదాయం కోల్పోనుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి HMDAకు ఆదాయం అధికంగా వస్తోంది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాల్టీలో గ్రేటర్లో భాగం కానున్నాయి. అంటే.. హెచ్ఎండీఏ పరిధి కూడా తగ్గనుంది. ఈ క్రమంలో రాబడి కూడా తగ్గిపోతుంది. HMDAకు నెలనెలా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుండగా.. విలీనం అనంతరం రూ.20 కోట్లకు పడిపోతుందని సమాచారం.


