News February 22, 2025
శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.
Similar News
News November 28, 2025
కడప: హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరు..?

జిల్లాలో వెలుగులోకొచ్చిన రూ.కోట్ల విలువైన హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పేజ్-3 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్కాంలో ఇప్పటి వరకు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుని జీతాలు నిలిపేశారు. సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులకు ఆదేశించారు. ఐతే రూ.కోట్లు కొల్లగొట్టిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News November 28, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్ పరిధిలో ఆధునీకరణ పనుల దృష్ట్యా జనవరిలో విశాఖ నుంచి బయలు దేరే పలు రైళ్లు రద్దు చేశారు.
➤ జనవరి 29,31న (12718) – రత్నాచల్ ఎక్స్ ప్రెస్
➤28నుంచి 30వరకు (17239) సింహాద్రి ఎక్స్ ప్రెస్
➤29 నుంచి 31వరకు (17240) సింహాద్రి ఎక్స్ ప్రెస్
➤ 29,30న (12806) జన్మభూమి ఎక్స్ ప్రెస్
➤ 28,29న (12805)జన్మభూమి ఎక్స్ ప్రెస్
➤ 29,31న (67285, 67286) రాజమండ్రి -విశాఖ MEMU పాసెంజర్ రద్దు చేశారు.
News November 28, 2025
సత్యసాయి జిల్లా యువతికి అరుదైన ఛాన్స్

సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంభాలట్టికి చెందిన దీపికకు అరుదైన గౌరవం దక్కింది. టీమ్ ఇండియా అంధుల జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఇటీవల టీ20 ప్రపంచకప్ను గెలిపించిన దీపిక, గురువారం జట్టు సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీపిక ప్రధానితో ఫొటో దిగారు. ప్రధాని మోదీ ఆమెను అభినందించారు.


