News February 22, 2025
శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.
Similar News
News March 25, 2025
అనంత: పరిష్కార వేదికకు 63 పిటిషన్లు.!

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRC కార్యక్రమంలో 63 పిటీషన్లు వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ స్వయంగా వారి సమస్యను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించి, వారి సమస్యను పరిష్కరించాలని పోలీసులకు ఆయన సూచించారు.
News March 24, 2025
అనంత: ఈతకు వెళ్లి 10th విద్యార్థి మృతి.!

అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని మొబ్బు కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
News March 24, 2025
ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.