News February 7, 2025
శ్రీ సత్యసాయి: నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య

సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
Similar News
News November 6, 2025
స్త్రీ నిధి రుణాలు, రికవరీపై కలెక్టర్ సమీక్ష

స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పనితీరు, ఆర్థికప్రణాళికలు, రుణాల పంపిణీపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. ఎస్హెచ్జీల్లో కొత్తసభ్యులను చేర్చుకోవాలన్నారు. మార్చి2026 వరకు జిల్లాలో ఎన్పీఏ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి మంగళ,శనివారాలను ‘రికవరీ డే’గా నిర్ణయించి, స్త్రీనిధిలో బ్యాంక్ లింకేజీ, సామాజిక పెట్టుబడి నిధి బకాయిలు లేకుండా చూడాలని సూచించారు.
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


