News March 22, 2025

శ్రీ సత్యసాయి: ప్రాథమిక అంశాలపై నివేదికల సమర్పించాలి

image

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.

Similar News

News November 24, 2025

VKB: జిల్లా రాజకీయాల్లో యువ గర్జన.. పాత లీడర్లకు సవాల్!

image

వికారాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల హీట్ మొదలైంది. ఈసారి పంచాయతీల్లో యువత పెద్ద ఎత్తున రంగంలోకి రావడంతో రాజకీయ వాతావరణం మారిపోయింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలు చేస్తూ, గ్రామ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పాత నేతలకు యువత నేరుగా సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికల్లో “యువ శక్తి vs పాత నేతలు” పోటీ హాట్‌గా మారనుంది. యువ శక్తే ఈసారి గేమ్‌చేంజర్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది.

News November 24, 2025

GNT: ఆస్తి పన్ను వసూళ్లలో కట్టుదిట్టం

image

జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో రసీదు పుస్తకాల దుర్వినియోగంతో పన్ను సొమ్ము పక్కదారి పడుతోంది. పన్ను చెల్లించినా మళ్లీ రసీదులు ఇస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసింది. వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపి, క్యూఆర్ కోడ్ యూపీఐతో చెల్లించిన వెంటనే రసీదు మొబైల్‌కి వస్తోంది. ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లకుండా ఖాతాకు జమ అవుతోంది. మొత్తం బకాయిలు రూ.47.82 కోట్లు.

News November 24, 2025

MBNR: 110 పోగొట్టుకున్న ఫోన్లు స్వాధీనం

image

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొత్తం 110 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ (Central Equipment Identity Register) సహకారంతో ట్రేస్ చేసి, సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో బాధితులకు అందజేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.