News March 22, 2025

శ్రీ సత్యసాయి: ప్రాథమిక అంశాలపై నివేదికల సమర్పించాలి

image

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.

Similar News

News October 28, 2025

శ్రీకాకుళం టుడే టాప్ హెడ్ లైన్స్ ఇవే

image

➫శ్రీకాకుళం జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం
➫తుఫాన్ పై అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
➫శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
➫మెండపేట-రాళ్లపేట రహదారి గుంతలమయం
➫శ్రీకాకుళం:చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
➫తుఫాన్ ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
➫పొందూరు, ఎల్.ఎన్ పేటలో నేలమట్టం అయిన వరి పంట

News October 28, 2025

వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

image

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్‌కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.

News October 28, 2025

KNR: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ పమెల సత్పతి ఆధ్వర్యంలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. సెప్టెంబర్ 26న టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టి దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23 వరకు స్వీకరించారు. మొత్తం 2,730 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 01 నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.