News February 15, 2025
శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలపై 15 రోజులకోసారి సమీక్ష

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో బాబా పుట్టిన స్థలం, బాబా తల్లి ఉన్న ప్రాంతాలను గుర్తించి సుందరీకరణ పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Similar News
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.
News October 27, 2025
నగరంలో ఉ‘సిరి’కి భారీ డిమాండ్

నగరంలో చాలా ప్రాంతంలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం అవడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వనస్థలిపురం రైతుబజారులో 250గ్రా. ఉసిరి రూ.30- ₹50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50- ₹80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.


