News January 29, 2025

శ్రీ సత్యసాయి: మాతృ, శిశు మరణాలపై సమీక్ష 

image

శ్రీ సత్యసాయి జిల్లాలో మాతృ, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రోజా బేగం ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, కలెక్టర్ పలు సూచనలు చేశారు. సత్యసాయి జిల్లాలో మాతృ, శిశు మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, ముందుకు వెళ్లాలని ఆదేశించారు.

Similar News

News October 18, 2025

కాకినాడ: మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం సమీక్ష

image

ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News October 18, 2025

GNT: రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన DRM

image

రైల్వే ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయని టికెట్లను పొందడానికి M-UTS యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుంటూరు రైల్వే డీఆర్ఎం సుదేష్ణసేన్ తెలిపారు. పట్టాభిపురం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం యాప్ ఆవిష్కరించారు. యాప్ ద్వారా టికెట్ వివరాలు అందించి మొబైల్ ప్రింటర్ నుండి టికెట్ ని రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్ఎం పిలుపునిచ్చారు.

News October 18, 2025

18న ‘క్లీన్ ఎయిర్’ థీమ్‌తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర: కలెక్టర్

image

‘క్లీన్ ఎయిర్’ (స్వచ్ఛమైన గాలి) థీమ్‌తో ఈనెల 18న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా తెలిపారు. గాలి కాలుష్యాన్ని తగ్గించి, హరిత విస్తీర్ణం పెంచాలని సూచించారు. ప్రజారవాణా, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలని, పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.