News February 22, 2025

శ్రీ సత్యసాయి: ‘లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

image

శ్రీ సత్యసాయి జిల్లాలో లాంగ్ పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు జిల్లాలోని లాంగ్ పెండింగ్ కేసులతో పాటు ముఖ్యమైన కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 4, 2025

కాకినాడ: అక్కడే ఎందుకిలా జరుగుతోంది.. సర్వత్రా చర్చ!

image

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ను వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా చేబ్రోలు PHCలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిఠాపురం ఆసుపత్రిలో మహిళ ప్రసవించి చనిపోవడం, కొత్తపల్లిలో పాఠశాలకు తాళం వేయడం, హెడ్మాస్టర్ కులం పేరుతో దూషించడం వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై డీసీఎం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

News December 4, 2025

32వేల మంది టీచర్లకు ఊరట

image

పశ్చిమ బెంగాల్‌లో 32వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ నియామకాలు చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 2014లో టెట్ ద్వారా టీచర్లుగా నియమితులైన అందరూ అక్రమంగా ఉద్యోగాల్లో చేరినట్లు దర్యాప్తులో తేలలేదని కోర్టు పేర్కొంది. 264 మంది మాత్రమే అలా చేరారని, వీరి కోసం 32వేల మంది రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

News December 4, 2025

వచ్చే నెలలో ‘భూభారతి’.. మూడు విడతల్లో ‘భూధార్’: మంత్రి పొంగులేటి

image

TG: జనవరిలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని, ఈ మూడింటి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందిస్తున్నామన్నారు. కొత్త సర్వే నంబర్లు, బౌండరీలు ఫిక్స్ చేసి భూధార్ కార్డులను సిద్ధం చేస్తామని చెప్పారు. మూడు విడతల్లో వీటిని అందిస్తామని పేర్కొన్నారు.