News January 27, 2025

శ్రీ సత్యసాయి: ‘వాటర్ బాటిల్ అడిగి.. మెడలో గొలుసు లాక్కెళ్లారు’

image

నల్లమాడ పరిధిలోని దోన్నికోట చెర్లోపల్లిలో ఆదివారం రత్నమ్మ అనే మహిళ మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసును ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. సీఐ నరేందరరెడ్డి వివరాల మేరకు.. బజ్జీ కొట్టుతో జీవించే రత్నమ్మ దగ్గరికి ఇద్దరు బైకులో వచ్చి వాటర్ బాటిల్ అడిగారు. బాటిల్ ఇస్తున్న క్రమంలో మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయినట్లు ఫిర్యాదు అందిదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

Similar News

News February 16, 2025

కల్వకుర్తి: ‘స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’ 

image

ఎర్రవల్లి – గోకారం జలాశయ బాధితులు, ఎర్రవల్లి గ్రామ పంచాయితీ ప్రజలు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరించారు. ఊర్లోకి ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రచారానికి రావడానికి వీలు లేదని హెచ్చరించే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జలాశయ సామర్థ్యం తగ్గించి ఎర్రవల్లి గ్రామపంచాయితీ ముంపుకు గురికాకుండా ఉంటుందని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు.

News February 16, 2025

చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

image

గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News February 16, 2025

పెద్దపల్లి: అధికారులకు అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

అటవీ శాఖ పరిధి భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కలెక్టరేట్ల అదనపు కలెక్టర్ వేణు అన్నారు. జిల్లాలో ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్‌కు సూచించారు. చెడు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా చూడాలన్నారు.

error: Content is protected !!