News February 5, 2025
శ్రీ సత్యసాయి: హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు

మద్యం తాగి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు. గోరంట్లలోని ఎంపీపీ వంక స్కూలులో హెచ్ఎం నాగేశ్వరరావు మద్యం తాగి ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవహిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు చేశామని, ఘటనపై విచారిస్తున్నామని సీఐ తెలిపారు.
Similar News
News November 23, 2025
తీవ్ర అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా, ఆ తర్వాత 2 రోజుల్లో తుఫానుగా బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది.
News November 23, 2025
ఏడీఈ పోస్టింగ్స్లో పైరవీల హంగామా!

NPDCLలో ఏఈ నుంచి ఏడీఈలుగా ప్రమోషన్ పొందిన ఇంజినీర్ల పోస్టింగ్స్పై పైరవీలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ముగ్గురు అసోసియేషన్ నేతలు డబ్బులు వసూలు చేసినట్టుగా సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్ కల్పిస్తామని హామీలు ఇచ్చినట్టు చెబుతున్నారు. WGL జోన్లో 30-40 AE, 70-80 ADE పోస్టులకు పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. దీంతో అర్హులకు న్యాయం చేయాలంటున్నారు.
News November 23, 2025
వరంగల్: టీజీ ఎన్పీడీసీఎల్లో ఇన్ఛార్జ్ పదోన్నతులు

టీజీ ఎన్పీడీసీఎల్లో నెలలుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ఎట్టకేలకు ఇన్ఛార్జ్గా పదోన్నతులు ఇచ్చి యాజమాన్యం ముగింపు పలికింది. కోర్టు కేసుల కారణంగా రెగ్యులర్ పదోన్నతులు జాప్యం కావడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తాయి. వాటి నివారణకు ముగ్గురు ఎస్ఈలను చీఫ్ ఇంజినీర్లుగా, ఆరుగురు డీఈలను ఎస్ఈలుగా, 21 మందిని డీఈలుగా పదోన్నతి చేశారు. అలాగే, కొన్ని పరిపాలనా హోదాలకు కూడా ఇన్ఛార్జ్ ప్రమోషన్లు మంజూరు చేశారు.


