News March 13, 2025

శ్రీ సత్యసాయి: 15న స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

image

స్వచ్ఛ ఆంధ్ర, హరితాంద్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమం జరుగుతుందన్నారు.

Similar News

News November 19, 2025

ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు మంజూరైన ఇండ్ల నిర్మాణాలు ఏ ఏ దశల్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయి ఉన్న ఇంటిని కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జలజా కుమారి పాల్గొన్నారు.

News November 19, 2025

కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: కలెక్టర్

image

కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం సరిపోయిన ధాన్యాన్ని నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన తుర్కపల్లి మండలం పెద్దతండ, ములకలపల్లి గ్రామాల్లో గల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ఎంత ధాన్యం వచ్చిందనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News November 19, 2025

ఓయూలో ఘనంగా వార్షికోత్సవం

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ విభాగంలో వార్షికోత్సవం (ఓక్ మైలురాయి), ఎం.కామ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మొత్తం 33 మంది సభ్యులు గల ఈ బ్యాచ్ నుండి 23 మంది పూర్వ విద్యార్థులు ఈ మనోహరమైన సమావేశంలో పాల్గొన్నారు. శతాబ్దంలో తాము సాధించిన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రయాణాలను వివరిస్తూ వారు భావోద్వేగాలను పంచుకున్నారు.