News March 13, 2025
శ్రీ సత్యసాయి: 15న స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

స్వచ్ఛ ఆంధ్ర, హరితాంద్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమం జరుగుతుందన్నారు.
Similar News
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.
News November 26, 2025
పెద్దపల్లి: జిల్లా కలెక్టర్తో రాణి కుముదిని VC

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
News November 26, 2025
VZM: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమం

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ డీపీటీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలు నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా, సలహాలు ఉన్న నం.9959225604 ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని కోరారు.


