News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.
Similar News
News March 31, 2025
ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
News March 31, 2025
కంది: నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

సంగారెడ్డి జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. 25% రాయితీ గడువు నేటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.