News January 26, 2025

శ్రీ సత్యసాయి: PIC OF THE DAY

image

బత్తలపల్లి మండల కేంద్రంలో తమ చిన్నారిని త్రివర్ణ పతాకం డ్రస్సుతో అలంకరించి భారతదేశంపై ఉన్న అభిమానాన్ని ఓ ముస్లిం కుటుంబం చాటుకుంది. సయ్యద్ దాదాపీర్, సయ్యద్ ఫర్హాన దంపతులు తమ చిన్నారి అర్ఫాకు త్రివర్ణ పతాకం రంగులతో కూటిన డ్రెస్‌ను అలంకరించారు. జాతీయ జెండాను పట్టుకొని బత్తలపల్లి 4 రోడ్ల కూడలిలో జై భారత్.. జై భారత్.. అంటూ భారతదేశం గొప్పతనం గురించి కొనియాడారు.

Similar News

News December 6, 2025

విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

image

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.

News December 6, 2025

NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

image

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.

News December 6, 2025

వికారాబాద్: గ్రామాల్లో మొదలైన బేరసారాలు..!

image

గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అయితే రెండో విడతలో ఈరోజు విత్ డ్రా ఉండడంతో గ్రామాలలో బేర సారాలు గట్టిగానే నడుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే విందులు వినోదాలు ఉత్సాహపరుస్తున్నారు. బేరసారాలు మాత్రం లక్షల్లో పలుకుతున్నట్లు సమాచారం. ఉప సర్పంచు పదవి ఆశిస్తున్న వారు తమ వార్డులో ప్రత్యర్థిగా నామినేషన్ వారితో సెటిల్మెంట్ ఆఫర్లు ఇస్తున్నారట. ఈరోజు ఎన్ని విత్ డ్రా లు అయితాయో చూడాలి.