News January 26, 2025

శ్రీ సత్యసాయి: PIC OF THE DAY

image

బత్తలపల్లి మండల కేంద్రంలో తమ చిన్నారిని త్రివర్ణ పతాకం డ్రస్సుతో అలంకరించి భారతదేశంపై ఉన్న అభిమానాన్ని ఓ ముస్లిం కుటుంబం చాటుకుంది. సయ్యద్ దాదాపీర్, సయ్యద్ ఫర్హాన దంపతులు తమ చిన్నారి అర్ఫాకు త్రివర్ణ పతాకం రంగులతో కూటిన డ్రెస్‌ను అలంకరించారు. జాతీయ జెండాను పట్టుకొని బత్తలపల్లి 4 రోడ్ల కూడలిలో జై భారత్.. జై భారత్.. అంటూ భారతదేశం గొప్పతనం గురించి కొనియాడారు.

Similar News

News December 9, 2025

ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

image

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.

News December 9, 2025

సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

image

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్‌లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

News December 9, 2025

గద్వాల్: నేటితో ముగియనున్న ప్రచారం

image

తొలి విడుత పంచాయతీ సమరం రెండు రోజుల్లో ముగియనుంది. జిల్లాలో ధరూర్, గద్వాల్, గట్టు, కేటిదొడ్డి మండలాల్లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 106 గ్రామ పంచాయతీ, 974 వార్డు మెంబర్లకు గాను 14 సర్పంచ్, 120 వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోరు జరగనుంది. నేటితో ప్రచారానికి END కార్డు పడనుంది.