News January 26, 2025

శ్రీ సత్య సాయి జిల్లాలో 561 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందించిన 561 మందిని ఉత్తమ సేవా అవార్డులకు ఎంపిక చేశారు. నేడు పుట్టపర్తిలోని శిరసాని హిల్స్ వద్ద పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర వేడుకలలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఉత్తమ సేవ ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు డివిజన్ మండల శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు.

Similar News

News February 18, 2025

NRPT: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

image

ఈనెల 19న నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం కళాశాల ఆవరణలో విడుదల చేశారు. పదికి పైగా బహుళ జాతి కంపెనీలు మేళాలో పాల్గొంటాయని అన్నారు. SSC, INTER, DEGREE, PG, ITI, COMPUTER పరిజ్ఞానం ఉన్న వారు మేళాలో పాల్గొనాలని చెప్పారు.

News February 18, 2025

నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

image

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

News February 18, 2025

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 5 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద దేవి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.

error: Content is protected !!