News March 16, 2025
శ్రీ సత్య సాయి జిల్లా: పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలలో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు.
Similar News
News November 6, 2025
జీతాల కోసం ఎదురుచూపు: ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం కొన్ని శాఖలకు మాత్రమే చెల్లింపులు జరిగాయని, రెవెన్యూ, దేవాదాయం వంటి కీలక శాఖల అధికారులకు కూడా జీతాలు విడుదల కాలేదని కాకినాడ జిల్లా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఒకటో తేదీనే ఇస్తామని చెప్పినా కూటమి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో, తాము బ్యాంకు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత మూడు చక్రాల మోటార్ సైకిళ్లు

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్తో నడిచే మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆ శాఖ జిల్లా మేనేజర్ రామ్ కుమార్ బుధవారం తెలిపారు. అర్హత గల 18 నుంచి 45 ఏళ్ల వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు, ఇతర పత్రాలను నవంబర్ 25లోగా ఏలూరు కార్యాలయంలో అందించాలని ఆయన స్పష్టం చేశారు.


