News March 16, 2025

శ్రీ సత్య సాయి జిల్లా: పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలలో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు.

Similar News

News November 28, 2025

పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

image

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

News November 28, 2025

భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 28, 2025

బాసర RGUKTకి స్కిల్ డెవలప్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు

image

బాసర RGUKT కళాశాలకు ‘స్కిల్ డెవలప్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు-2025’ లభించింది. విద్యార్థుల ఉద్యోగ నియామకాలలో అంతర్జాతీయ, ప్రభుత్వ ఉద్యోగాలలో భాగస్వామ్యం, పరిశోధన, సాంకేతికత, యువ నాయకత్వం వంటి అంశాలలో గణనీయమైన పురోగతి సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.