News February 22, 2025

శ్రీ సత్య సాయి: 42 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు

image

శ్రీ సత్య సాయి జిల్లాలో 42 కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి సంవత్సరం 13,083 మంది, ద్వితీయ సంవత్సరంలో 10,904 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు.

Similar News

News October 19, 2025

పల్నాడు: HYD-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే.. మార్గం ఇదే.!

image

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల భాగంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే.. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల మీదుగా వెళ్లనుంది. ఈ హైవే ద్వారా కేవలం 3 గంటల్లో అమరావతి చేరుకునేలా డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. పల్నాడు జిల్లాలో ఈ హైవే పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, మాచవరం, తురకపాలెం, మొర్జంపాడు గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు.

News October 19, 2025

ముడతలు తొలగించే గాడ్జెట్

image

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్‌ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్‌ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.

News October 19, 2025

IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్‌ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.