News February 8, 2025
షర్మిలకు కేతిరెడ్డి కౌంటర్

YS జగన్పై షర్మిల చేసిన కామెంట్స్కు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నేత ఎవరో ప్రజలకు తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే ఆడిటర్గా ఉన్న వ్యక్తి పదవులు అనుభవించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లాక మీకేదో చెప్పారని దాన్ని మాట్లాడటం, YS కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 26, 2025
KKR హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్!

IPL: కోల్కతా నైట్రైడర్స్కు కొత్త హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్కు నాయర్ హెడ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే.
News October 26, 2025
పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

★ మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి
★ శ్రమించి పనిచేసే వారికి సర్వసంపదలు చేకూరుతాయి
★ చక్కెరలో నీటిని కలిపినప్పుడు పానకం అవుతుంది, దైవనామ స్మరణతో ప్రేమను కూర్చినప్పుడు అది అమృతం అవుతుంది.
News October 26, 2025
కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


