News February 8, 2025
షర్మిలకు కేతిరెడ్డి కౌంటర్

YS జగన్పై షర్మిల చేసిన కామెంట్స్కు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నేత ఎవరో ప్రజలకు తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే ఆడిటర్గా ఉన్న వ్యక్తి పదవులు అనుభవించారు. పార్టీ నుంచి బయటకి వెళ్లాక మీకేదో చెప్పారని దాన్ని మాట్లాడటం, YS కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 24, 2025
గద్వాల: గడువు కాలం మరో మూడు నెలలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి నూతన అక్రిడేషన్ జారీ చేయకుండా గత ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ గడువు కాలాన్ని పెంచుతుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 145 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 145 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పరీక్ష జరగ్గా రెగ్యులర్ విద్యార్థులు 21,394 మందికి గానూ 21,283 మంది హాజరయ్యారని, ప్రైవేటు విద్యార్థులు 235 మందికి గానూ 201 హాజరయ్యారన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి.
News March 24, 2025
ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.