News February 21, 2025

షర్మిల చాలా ఖాళీగా ఉన్నారు: బొత్స

image

వ్యక్తిగత విభేదాలతోనే జగన్‌పై షర్మిల విమర్శలు చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా షర్మిల లేరు. చంద్రబాబు, బీజేపీ వైఫల్యాలను షర్మిల ప్రశ్నించరు. ఆమె చాలా ఖాళీగా ఉన్నారు. ఏదేదో మాట్లాడుతుంటారు. ఆమెకు మేము సమాధానం చెప్పం’ అని బొత్స కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు ఉద్దేశపూర్వకంగా భద్రత ఇవ్వలేదంటూ గవర్నర్‌కు బొత్స ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News December 4, 2025

తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

image

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.

News December 4, 2025

MHBD: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: SP

image

తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరిష్ సూచించారు. ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్నిసార్లు పొగ మంచు ఎక్కువగా ఉంటే వాహనాలు ఆపాలన్నారు. నిర్దిష్ట స్పీడ్‌తో వాహనాలను నడపడం వల్ల స్లిప్పరీ రోడ్ల నుంచి వాహనాలు స్కిడ్ కాకుండా నివారించవచ్చన్నారు.

News December 4, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1921, కనిష్ఠ ధర రూ.1731; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2051, కనిష్ఠ ధర రూ.1700; వరి ధాన్యం (HMT) ధర రూ.2301; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3025, కనిష్ఠ ధర రూ.2100గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.