News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్లో బైక్తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
News November 22, 2025
MBNR: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు..!

వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసే గ్రామాలకు రూ.10 లక్షల ప్రొత్సాహకం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. మహబూబ్నగర్ 441, నాగర్కర్నూల్ 461, నారాయణపేట 280, వనపర్తి 268, గద్వాల్ 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News November 22, 2025
ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ఇస్తాం: మంత్రి తుమ్మల

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లోపు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ప్రతి మహిళకు వద్దకు వెళ్లి, బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరలను అందించాలని సూచించారు.


