News March 23, 2025
షాద్నగర్లో హాస్టల్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

షాద్నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News October 20, 2025
వనపర్తి: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు 490 కేంద్రాలు

జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు 490 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేశారు. జిల్లాలో 1.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 4.69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వం 4.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 20, 2025
మెట్పల్లి: NOV 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

అరుణాచలగిరి ప్రదక్షిణకు మెట్పల్లి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును NOV 3న ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు. మ.2గ.లకు బస్సు బయలుదేరుతుందన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలానికి బస్సు చేరుకుంటుందని, 5న జరిగే గిరిప్రదక్షిణ అనంతరం జోగులాంబ, ముచ్చింతల దర్శనాల తర్వాత 6న రాత్రి బస్సు మెట్పల్లి చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.3,760 ఛార్జీ. 9959225927.
News October 20, 2025
డబ్బుల్లేక భోజనం చేసేందుకు ఇబ్బందిపడ్డాం: సమంత

తాను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కుటుంబం పడ్డ బాధలను ఎప్పుడూ మరిచిపోలేదని తెలిపారు. ఆ సమయంలో డబ్బులు సరిగ్గా లేకపోవడంతో భోజనం చేయడానికి ఇబ్బంది పడినట్లు గుర్తు చేశారు. మొదటి సినిమాతోనే పేరు, ప్రశంసలు వచ్చాయని, వాటిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదన్నారు. కష్టపడితేనే జీవితం ఉంటుందని తనను తాను మార్చుకొని ముందుకు వెళ్లానని వెల్లడించారు.