News December 1, 2024

షాద్‌నగర్: ట్రాక్టర్ బోల్తా.. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి

image

కొత్తూరు మున్సిపాలిటీ స్టేషన్ తిమ్మాపూర్ వద్ద <<14756133>>ట్రాక్టర్ బోల్తా<<>> పడి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా మృతుల్లో మహిళతోపాటు ఐదేళ్ల చిన్నారి ఉండటం కలిచివేసింది. APలోని కర్నూల్‌కు చెందిన కూలీలు మండలంలోని రెడ్డిపాలెంలో పనులకు వస్తున్నారు. తిమ్మాపూర్‌లో రైలు దిగిన వారు ట్రాక్టరుపై రెడ్డిపాలెం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో సోమమ్మ(50), మమత(5) అక్కడిక్కకడే మృతిచెందారు.

Similar News

News February 17, 2026

MBNR: మేయర్, డిప్యూటీ మేయర్ వేతనాలు ఎంతో తెలుసా..!

image

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా ముగిశాయి. ఎంతోమంది ఎన్నో ఎన్నో లక్షల ఖర్చు చేసుకుని ఎన్నికల్లో పోటీపడి కార్పొరేటర్‌గా గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూడా గట్టి పోటీ ఉంటుంది. మేయర్ నెలసరి వేతనం రూ.65 వేలు ఉంటుంది. అలాగే డిప్యూటీ మేయర్‌కు రూ.32,500, అలాగే కార్పొరేటర్‌కు రూ.7,800 వేతనాలు ఉంటాయి.

News February 16, 2026

హోరాహోరీ పోరులో పాలమూరు విజయం

image

జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 టోర్నీ ఫైనల్‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌లో 110/5 ప‌రుగులు చేసింది. రామ్ చారి 31, కేతాన్ 30 ప‌రుగులు చేశారు. నాయక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఖ‌మ్మం జ‌ట్టు 107/5 ప‌రుగులు చేసింది. 4 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. మాన్విత్ 30, సులేమాన్ 29 ప‌రుగులు చేశారు. ముఖ్య అతిథిగా ఏఎంఓ శ్రీనివాసులు, మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ జ్యోతి హాజరయ్యారు.

News February 16, 2026

MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్

image

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్‌నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.