News February 21, 2025
షాద్నగర్: మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావు: మాజీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి హరీశ్రావు కృష్ణాజలాలపై ప్రశ్నిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులతో కలిసి కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News February 23, 2025
తుర్కయంజాల్: అసభ్యకరంగా యువత ప్రవర్తన.!

హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో తుర్కయంజాల్ మాసాబ్ చెరువు దగ్గర కొంత మంది యువతీ యువకులు అసభ్యకరమైన ప్రవర్తన చేస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఫామిలీతో పాటు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో చెక్కర్లు కొడుతోంది. అధికారులు స్పందించి యువత ఇక్కడ ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News February 23, 2025
యాచారం: మహిళపై అత్యాచారం.. యువకుడికి రిమాండ్

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని శనివారం యాచారం పోలీసులు రిమాండ్కు తరలించారు. యాచారం మండల పరిధిలోని మాల్లో ఉంటున్న మతిస్థిమితంలేని మహిళపై నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లికి చెందిన పోలే శ్రీశైలం (25) అనే యువకుడు గత డిసెంబర్ 9న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుని గుర్తించి రిమాండ్కు తరలించారు.
News February 22, 2025
HYD: చందానగర్లో దారుణ హత్య

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్కు చెందిన ఫక్రుద్దీన్, నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.