News June 7, 2024

షార్జా బీచ్‌లో బోధన్ వాసి మృతదేహం

image

బోధన్ రాకాసిపేట్‌కు చెందిన అవైస్‌‌యాబా (25) అనే యువకుడు షార్జా బీచ్‌లో మృతి చెందారు. యువకుడు ఉపాధి కోసం నాలుగు నెలల కిందట దుబాయి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం యాబా అదృశ్యమయ్యాడు. తెలిసిన వారు అక్కడ అన్వేషించగా షార్జాలోని అల్- మంజర్ బీచ్‌లో ఓ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. బంధువులు అది అవైస్‌‌యాబాదేగా ధ్రువీకరించినట్లు వివరించారు.

Similar News

News February 12, 2025

NZB: ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఎమ్మెల్సీ కవిత

image

కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోగా హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారన్నారు.

News February 11, 2025

బాల్కొండ: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

బాల్కొండలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్, డైనింగ్ హాల్‌లను కలెక్టర్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.

News February 11, 2025

నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

error: Content is protected !!