News September 19, 2024
షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

మహిళాలు, విద్యార్థినులకు అండగా జిల్లాలో షీ టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా జిల్లాలో షీ టీమ్స్ అధ్వర్యంలో 42 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి, 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 13 ఫిర్యాదులు స్వకరించినట్లు చెప్పారు. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 45 కేసులు నమోదు చేశామన్నారు. వేధింపులపై 87126 86056 ద్వారా ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Similar News
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
News November 24, 2025
ఎన్ఎంఎంఎస్ పరీక్ష.. 1,444 మంది హాజరు

నల్గొండ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 8 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు 1,444 మంది అభ్యర్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 1,504 మందికి గాను 60 మంది గైర్హాజరయ్యారు. 16 మంది ఎంఈవోలు, 8 మంది సెట్టింగ్స్ స్క్వాడ్, రెవెన్యూ సిబ్బందిని నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.


