News August 7, 2024
‘షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలి’

పెన్షన్ పంపిణీలో ఆలస్యం చేశారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందికి పైగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీటిని ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. షణ్ముఖ్, పార్ష మధు, మణికంఠ పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.


