News January 13, 2025
సంక్రాంతికి వస్తున్నారా..ఇవి మిస్ కావద్దు

పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం నుండి సంక్రాంతి సందడి మొదలైపోతుంది. పండుగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అలా వచ్చేవారు సంక్రాంతి మూడు రోజులు ఈ ప్లేస్లు మాత్రం మిస్ కావద్దు. భీమవరం మావుళ్ళమ్మ జాతర, భీమవరం, పాలకొల్లు, మొగల్తూరులో జరిగే సంక్రాంతి సంబరాలు, పేరుపాలెం బీచ్లో, నరసాపురం వణువులమ్మ జాతర.
Similar News
News February 12, 2025
యలమంచిలి : కళాశాల హాస్టల్లో విద్యార్థి సూసైడ్

ప.గో జిల్లా యలమంచిలికి చెందిన రావూరి సాయిరాం (22) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం బాడవకు తీసుకొచ్చారు. అయితే అతని మృతికి కారణాలు తెలియలేదని కాకినాడ పోలీసులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. వేరే కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 12, 2025
తణుకు: బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు ఇవే…!

బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన తణుకు మండలం వేల్పూరులో కోళ్లఫారం నుంచి 10 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇన్ఫెక్టెడ్ ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. తణుకు మండలంలోని తణుకుతోపాటు కొమరవరం, యర్రాయిచెరువు, మండపాక, తేతలి, ఇరగవరం మండలం ఇరగవరం, కావలిపురం, రేలంగి, అర్జునుడుపాలెం, అత్తిలి మండలంలో గుమ్మంపాడు, పాలి, బల్లిపాడు, పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామాలను ప్రకటించారు. చికెన్, గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు.
News February 12, 2025
ఓఎన్జీసి ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

దేశాభివృద్ధికి చమురు గ్యాస్ ఉత్పత్తులను వెలికి తీయడం ఎంత ముఖ్యమో, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి ఓఎన్జీసి ప్రతినిధులకు సూచించారు. మంగళవారం నాగిడిపాలెం తుఫాను పునరావాస కేంద్రం ఖాళీ ప్రదేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.