News January 26, 2025
సంక్రాంతి తర్వాత టీచర్లే రాలేదు: రాళ్లగడ్డ సర్పంచ్

గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రాళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలను సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి తెరవలేదని సర్పంచ్, విద్యా కమిటీ ఛైర్మన్ కేలేబు కుమారి ఆరోపించారు. విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్లే స్కూల్కు డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఫలితంగా ఆదివాసీ బిడ్డలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News January 9, 2026
కృష్ణా: కోర్టులో ముగిసిన వాదనలు.. నిందితుల బెయిల్పై ఉత్కంఠ!

సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. తేలప్రోలు రాము సహా నలుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై SC, ST కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. పటమట PS CC ఫుటేజ్ సమర్పణపై కూడా విచారణ పూర్తయింది. గత విచారణకు రాని వంశీకి కోర్టు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
News January 9, 2026
విశాఖ: GVMC వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన మజ్జి రామారావు (59) అనే వ్యక్తిని తోటగురువు జంక్షన్లో జీవీఎంసీకి చెందిన క్లాప్ (CLAP) వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News January 9, 2026
నెల్లూరు: ‘భోగి మంటల్లో అవి వేస్తే ప్రమాదం’

టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగి మంటలలో వేయొద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పండగల్లో భాగంగా భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కేన్సర్, టీబీ, చర్మ, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయబద్ధంగా పండగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.


