News December 15, 2024

సంక్రాంతి సంబరం.. సరిగ్గా మరో నెల

image

సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రకృతి సోయగాలతో అలరించే ఇక్కడి పల్లెటూర్లు పండుగ శోభతో మరింత వన్నె సంతరించుకుంటాయి. రక్తి కట్టించే కోళ్ల పందేలతో తూ.గో, ప.గో జిల్లాల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతాయి. కొత్త అల్లుళ్లకు చేసే వినూత్న మర్యాదలు మరో స్పెషల్ అట్రాక్షన్. రంగ వల్లులు, ఉత్సవాలు, ఉద్యోగాలకు పట్నం వెళ్లిన వారి రాకతో సరిగ్గా మరో నెలలో పల్లెలు కళకళలాడనున్నాయి.

Similar News

News January 14, 2025

కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ

image

కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.

News January 14, 2025

ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు

image

రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.

News January 14, 2025

ఏలూరుకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య

image

తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.