News January 22, 2025
సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ ప్రజలను కోరారు. బుధవారం చివ్వెంల మండలంలో వట్టి ఖంపహాడ్ గ్రామం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాల జాబితాలో పేరు లేని వారికి గ్రామ సభల వద్దనే ప్రత్యేక దరఖాస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ ఉన్నారు.
Similar News
News November 20, 2025
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
News November 20, 2025
మరోసారి KTRను విచారించనున్న ఈడీ?

TG: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో KTRను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గవర్నర్ అనుమతి తీసుకోనుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏసీబీ దాఖలు చేసే ఛార్జ్ షీట్ను పరిశీలించే అవకాశం ఉంది. అటు ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతించిన సంగతి తెలిసిందే.
News November 20, 2025
మెట్రో రైల్తో తంట.. నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులు.?

విజయవాడ మెట్రో రైల్కు కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో నగర అభివృద్ధిలో కీలకమైన మహానాడు-నిడమానూరు, బెంజ్సర్కిల్-పెనమలూరు ఫ్లైఓవర్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మెట్రో ఆమోదం లేకుండా NHAI ఫ్లైఓవర్లు నిర్మిస్తే భవిష్యత్లో వాటిని తొలగించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మెట్రో-NHAI కలిసి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు ఏకకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంది.


