News January 22, 2025
సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ ప్రజలను కోరారు. బుధవారం చివ్వెంల మండలంలో వట్టి ఖంపహాడ్ గ్రామం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాల జాబితాలో పేరు లేని వారికి గ్రామ సభల వద్దనే ప్రత్యేక దరఖాస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ ఉన్నారు.
Similar News
News December 1, 2025
SRCL: ‘నిబంధనలకనుగుణంగా విధులు నిర్వహించాలి’

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్ఓ)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఎన్నికల, ఓట్ల లెక్కింపు వివిధ అంశాలపై సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సాధారణ వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ తో కలిసి శిక్షణ ఇచ్చారు.
News December 1, 2025
JGTL: T-హబ్లో డ్రైవర్లకు అందని బిల్లులు

జగిత్యాల T–హబ్లో పనిచేసే డ్రైవర్లకు 8 నెలలుగా బిల్లులు అందటం లేదు. అధికారులను అడిగిన ప్రతిసారి దాటేస్తున్నారని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5 రూట్లలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000-1500 వరకు శాంపిల్స్ సేకరించి T–హబ్ కు చేరుస్తారు. సోమవారం నుంచి డ్రైవర్లు విధులను నిలిపి వేయడంతో శాంపిల్స్ సేకరణ నిలిచిపోయాయి. ఇప్పటికైనా సమస్యపై ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
News December 1, 2025
గుమ్మలక్ష్మీపురం: చలికి వణకుతూ.. వానకు తడుస్తూ విద్యా పయనం

గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పంచాయతీ గాండ్ర గ్రామంలో 5వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు సుమారు 18 మంది ఉన్నారు.అయితే గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తమ పిల్లలు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదుపురం కాలినడకన వెళ్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. శీతాకాలంలో చల్లని గాలులకు,వర్షాకాలంలో వానలకు పిల్లలు ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వెళ్తున్నారని,అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


