News January 26, 2025

సంక్షేమ పథకాలను ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి

image

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 సంక్షేమ పథకాలను మండలంలోని గాంధీనగర్‌లో వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 24, 2025

ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

image

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

News October 24, 2025

NRPT: విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు: కలెక్టర్

image

నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించడంపై నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ 14న జిల్లా స్థాయిలో స్పెల్ బీ, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News October 24, 2025

మంథని: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా NOV 5న అరుణాచలగిరి ప్రదక్షిణకు మంథని డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడపనున్నట్లు డిపో మేనేజర్ వి.శ్రవణ్ కుమార్ తెలిపారు. NOV 3 సాయంత్రం మంథని నుంచి బయలుదేరి, KNR, HYD, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల తర్వాత 4న రాత్రి బస్ అరుణాచలం చేరుతుంది. 5న తిరుగు ప్రయాణం. 6న అలంపూర్ జోగులాంబ దర్శనమనంతరం మంథని చేరుకుంటుంది. టికెట్ పెద్దలకు రూ.5040, పిల్లలకు రూ.3790. 9959225923