News January 26, 2025
సంక్షేమ పథకాలను ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 సంక్షేమ పథకాలను మండలంలోని గాంధీనగర్లో వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
MBNR: బిచ్చగాడిని హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

దేవరకద్ర బస్ స్టాండ్ సమీపంలో బిచ్చగాడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో మహబూబ్నగర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు వెంకటేష్కు న్యాయమూర్తి వి.శారదా దేవి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసు విచారణలో శ్రమించిన సీఐ రామకృష్ణ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News September 17, 2025
HYD: ప్రైవేట్ పార్ట్స్పై విద్యార్థుల దాడి.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై కేసు

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు ప్రైవేట్ పార్ట్స్పై కాళ్లతో తన్ని గాయపరిచారు. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపల్కు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News September 17, 2025
పాడేరు: కార్వాన్ పార్క్ల ఏర్పాటుకు 5 స్థలాల గుర్తింపు

ఏజెన్సీలో కార్వాన్ పార్కుల ఏర్పాటుకు ఐదు స్థలాలు గుర్తించామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లో 3, రంపచోడవరంలో రెండు స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఐదు మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో కార్వాన్ టూరిజం ఏర్పాట్లపై కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీటీడీసీ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు.