News March 16, 2025

సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

image

స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్ల విలువ గల పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన వాటిలో 100 పడకల ఆసుపత్రి, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు కాలువలు, బంజారా భవన్, మహిళ శక్తి బస్సులు లాంటి సంక్షేమ పతకాలున్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

Similar News

News February 26, 2026

FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

image

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 26, 2026

పనితీరు ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్లు.. విద్యా కమిషన్ ప్రతిపాదన

image

TG: టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను CM రేవంత్ రెడ్డికి అందజేసింది.

News February 26, 2026

అంకురార్పణతో మొదలైన రంగడి బ్రహ్మోత్సవాలు

image

నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 26 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు అంకురార్పణలో భాగంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, మృత్ సంగ్రహణ, ఉత్సవమూర్తులకు రక్షాబంధన్, సోమ కుంభ ప్రతిష్ఠ, గరుడ ధ్వజ ప్రతిష్ఠ, అంకురార్పణ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.