News March 16, 2025

సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

image

స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్ల విలువ గల పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన వాటిలో 100 పడకల ఆసుపత్రి, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు కాలువలు, బంజారా భవన్, మహిళ శక్తి బస్సులు లాంటి సంక్షేమ పతకాలున్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

Similar News

News November 27, 2025

NZB: శుభముహూర్తం చివరి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్‌గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. మొదటి విడత 184 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలకు గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూఢాలు ప్రారంభం అవుతున్న క్రమంలో నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయి.

News November 27, 2025

బోధన్: 13 నెలల చిన్నారిని చిదిమేసిన ఆటో

image

సాలూరు మండలం సాలంపాడ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి ఆటోలో వచ్చిన వ్యక్తి అజాగ్రత్తగా నడిపి గ్రామానికి చెందిన 13 నెలల చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇర్ఫాన్, అయోష బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ బోధన్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్‌గా గుర్తించారు.

News November 27, 2025

వరంగల్: అక్ర‘మార్కులు’ కలిపిన ఆ పెద్దాయన ఎవరు..?

image

డబ్బులిస్తే ఫెయిల్ ఐనవారిని పాస్ చేయడం కొన్ని విద్యా సంస్థల్లో నిత్యంజరిగే వ్యవహారం. మనుషుల ప్రాణాలను కాపాడే ప్రాణదాతల విషయంలో సబ్జెక్టు లేకపోతే శంకర్ దాదా లాంటి డాక్టర్లు అవుతారు. ఈ లాజిక్‌ను మరిచిన ఓ పెద్దాయన లాగిన్‌లోనే ఈ అక్ర‘మార్కుల’ తంతు జరగడం కలకలం రేపుతోంది. అక్రమార్కులకు కేంద్రంగా మారిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీని ప్రక్షాళన చేయాలి. ఇంటిదొంగను కాపాడేందుకు ఓ నేత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.