News April 7, 2025
సంక్షేమ వసతి గృహాలలో అంబేడ్కర్ ఉత్సవాలు నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టరేట్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని వసతి గృహాలలో జయంతి వేడుకలు ఏర్పాట్లకు సన్నాహాలు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 17, 2025
హెల్మెట్ వాడకం తప్పనిసరి: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

ప్రపంచ ట్రామా డే సందర్భంగా ఏలూరులోని ఆశ్రమం ఆసుపత్రిలో శుక్రవారం హెల్మెట్ వాడకంపై ప్రత్యేక ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణాపాయానికి ముఖ్య కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఆయన కోరారు.
News October 17, 2025
ADB: ‘దారిద్ర్యం’పై పోరుకు ‘బీపీఎల్’ అస్త్రం

బీపీఎల్ కార్డులు పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కార్డులు దారిద్ర్య రేఖకు దిగువనున్న (BPL) లక్షలాది కుటుంబాలకు ఆకలి బాధను తీర్చి, పోషకాహార లోపాన్ని తగ్గిస్తున్నాయి. రాయితీపై ఆహార ధాన్యాల పంపిణీతో పాటు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది. ఉమ్మడిADBలో 6లక్షలకు పైగా BPL కార్డులు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి.
#నేడు అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం.
News October 17, 2025
బంగారం, వెండి కొంటున్నారా?

ధన త్రయోదశి సందర్భంగా రేపు బంగారం, వెండి కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాల అధినాయకురాలైన ధనలక్ష్మి కటాక్షం కోసం.. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొని, పూజించాలని సూచిస్తున్నారు. ఈరోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే రాబోయే ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని, సంపదకు లోటుండదని అంటున్నారు. ధనలక్ష్మి అనుగ్రహంతో కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.